JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 28 February 2026, 8:40 pm Posted by : JANA SANGARSHANA

తూతూ మంత్రంగా ఎస్సీ, ఎస్టీ అవగాహన సదస్సు..

బండార్ పలి లో తూతు మంత్రంగా బోధన్ అధికరణ నిర్వహిస్తున్నారు.

పల్లిలో ఎస్సీ ఎస్టీ అవగాహన సదస్సు..

– పౌర హక్కుల దినోత్సవం .

– నెలకు ఒకసారి నిర్వహించే

ఎస్సీ ఎస్టీ అవగాహన సదస్సు

– తూతు మంత్రంగా బోధన్ అధికరణ నిర్వహిస్తున్నారు.

బోధన్ : ఫిబ్రవరి 28 జన సంఘర్షణ

బోధన్ మండలంలోని బండర్‌పల్లి గ్రామంలో శనివారం ఎమ్మార్వో ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. బండార్ పల్లి గ్రామంలో ఎస్సీలు అధికంగా ఉండడం 15 సం. పర్యాయాలు సర్పంచ్ పదవి ఎస్సిలే పోటీ చేసి గెలుపొందారు. అక్కడ ఎస్సీలు, బీసీలు ఉండడం ఎస్సీ లు, ఎస్టిలకు, బీసీలకు అవగాహన కల్పించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు పదుల సంఖ్యలో కార్యక్రమాన్ని నిర్వహించి తూతూ మంత్రంగా వెళ్లిపోయారని బండర్ పల్లి గ్రామ ఎస్సీలు తెలిపారు.

అలాగే ఎస్సీ హాస్టల్ నుండి వచ్చిన వెల్ఫేర్ అధికారి ఎవరికి అవగాహన కల్పించారు.అని వారు ఆరోపించారు, ఎస్సీ హాస్టల్ కు వెళ్ళతే సరైన వసతులు లేవని ఆ గ్రామస్తులు పేర్కొన్నారు.

ఈ గ్రామంలో అధికంగా బండర్పల్లి గ్రామంలో అధికంగా ఎస్సీలు ఉన్నారు. పతి నెల జరపాల్సిన ఎస్సీ ,ఎస్టీ అవగాహన సదస్సును అన్ని వర్గాల అధికారులను గ్రామాలకు తీసుకెళ్లి అవగాహన కల్పించాలి కానీ తూతూ మంత్రంగా 10 మందితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు.

ప్రతి నెల ఎస్సీ ఎస్టీ అవగాహన సదస్సు ఏదో ఒక గ్రామంలో నిర్వహిస్తారు. కానీ ఎస్సీలు ఎస్టీలు అవగాహన కల్పించేందుకు ప్రతి అధికారులు గ్రామస్తులు అధికంగా పాల్గొని ఈ కార్యక్రమాలను ఎస్సీలకు అవగాహన కల్పించాలని బండర్ పల్లి ఎస్సీ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ ఎంఈఓ అలాగే ఆర్ ఐ,ఎంపీఓ, ప్రతి నెలకొకసారి జరిగే ఎస్పి, ఎస్టి, అవగాహన సదస్సుకు అందరూ అధికారులు పాల్గొని ప్రతి ఒక్క అధికారి తన శాఖకు సంబంధించిన అంశాల్ని వ్యక్తిపరచాలని గ్రామస్తులు తెలిపారు. ఏదో తుత్తు మంత్రంగా నిర్వహించే వెళ్లిపోవడం ఫోటోలకు పోజు ఇచ్చినట్లు అవుతుందని గ్రామస్తులు ఆరోపించారు. ఇకనైనా పై అధికారులు స్పందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మార్వో విటల్, ఆర్ ఐ , ఎం ఈ ఓ. నాగయ్య, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ తదితర అధికారులు పాల్గొన్నారు.