బోధన్ మండలం ఏరాజ్పల్లిలో యూరియా కొరతపై రైతులు గురువారం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం యూరియాను సకాలంలో అందించట్లేదని, ఆన్లైన్ యాప్ ద్వారా అమ్మకాలు చేపడుతుండడంతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామ రైతు నడిపి గంగారెడ్డి ఆరోపించారు. యూరియా కొరత లేకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. గతంలో మాదిరిగానే యూరియా పంపిణీ చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు.