బోధన్ : ఫిబ్రవరి 25
జన సంఘర్షణ
రెంజల్ మండలం కందకుర్తి పుష్కర ఘాట్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించిన నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆమె కందకుర్తి పుష్కర ఘాట్ను సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. గోదావరి పుష్కరాలకు లక్షలాదిగా భక్తులు పుణ్య స్నానాలకు తరలివచ్చే అవకాశాలు ఉన్నందున ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆమె ఆదేశించారు.