– మహారాష్ట్రలో పెరుగుతున్న ఘటనలు
( జన సంఘర్షణ డెస్క్ ) ఫిబ్రవరి 26
మహారాష్ట్రలో మహిళల మిస్సింగ్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. గడిచిన రెండేళ్లలో రాష్ట్రంలో 93,000 మంది మహిళలు (18 ఏళ్లు దాటిన వారు) కనిపించకుండా పోయారని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు దేవేంద్ర ఫడ్నవీస్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం తాజా నివేదికను అసెంబ్లీలో వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం ప్రతి రోజూ సగటున 129 మంది మహిళలు కనిపించకుండా పోతున్నారు. వీరిలో 72 శాతం మంది మహిళల్ని తర్వాత గుర్తిస్తున్నారు