JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 19 March 2026, 8:34 pm Posted by : JANA SANGARSHANA

కల్వకుంట్ల కవిత పార్టీ పేరు తెಲಂగాಣ ప్రజా జాగృతి

కవిత పార్టీ పేరు తెಲಂగాಣ ప్రజా జాగృతి

– జనవరి 23న దరఖాస్తు చేసుకున్న మాజీ ఎమ్మెల్సీ

జన సంఘర్షణ డెస్క్ 19

ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 సెక్షన్ 29ఏ కింద ఈసీకి అప్లికేషన్ పెండింగ్ లో పెట్టిన ఈసీ.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కవిత పార్టీ పేరు తెಲಂಗಾಣ ప్రజా జాగృతి జనవరి 23న దరఖాస్తు చేసుకున్న మాజీ ఎమ్మెల్సీ ప్రజాప్రాతినిధ్య చట్టం 1951సెక్షన్ 297 కింద ఈసీకి అప్లికేషన్ పెండింగ్లో పెట్టిన ఈసీ.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కవిత మాజీ ఎమ్మెల్సీ కవిత కొత్తపార్టీని ఏర్పాటు చేయబోతున్నారని తెలిసిందే. తన పార్టీ పేరును తెలంగాణ ప్రజాజా గృతిగా పేర్కొంటూ ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 29ఏ కింద ఈ ఏడాది జనవరి 23న ఆమె ఎన్నికల కమిషన్ కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే కొన్ని లోపాలు ఉన్నాయం టూ ఈసీ పెండింగ్ లో పెట్టింది. నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ఆమె ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఇవాళ వాదనలు జరిగాయి. సాంకేతిక తప్పులను సరిదిద్ది మళ్లీ ఈసీఐకి పంపినట్టు కవిత తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. దీనిపై ఈసీఐ తరపు న్యాయవాది స్పందిస్తూ కవిత కొత్త పార్టీ దరఖాస్తుపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటామని కోర్టుకు తెలిపారు.