JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 31 March 2026, 3:02 pm Posted by : JANA SANGARSHANA

బోధన్ పట్టణంలో హనుమాన్ జయంతి ఆర్గనైజర్లతో సమన్వయ సమావేశం

 

 

బోధన్ పట్టణంలో హనుమాన్ జయంతి ర్యాలీ సందర్భంగా ఆర్గనైజర్లతో సమన్వయ సమావేశం నిర్వహించిన పోలీస్ కమిషనర్

– డి.జె వాడకం పూర్తిగా నిషేధం

బోధన్ పట్టణంలోని లో హనుమాన్ జయంతి నిర్వహణ సందర్భముగా మంగళవారం రోజున ఉదయం బోధన్ లయన్స్ క్లబ్ యందు  నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య, ఐ.పీ.ఎస్, హనుమాన్ జయంతి శోభాయాత్ర ర్యాలీ నిర్వహకులతో వివిధ సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీలో పాటించవలసిన నియమ నిబంధనలు క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా భక్తిశ్రద్ధలతో ఉత్సాహం జరుపుకోవాలని ర్యాలీ పూర్తిగా ఆధ్యాత్మికముగా నిర్వహించుకోవాలని అదే సమయంలో ఇతరులకు మరియు సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని సూచించారు. ఎవరైనా సరే చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. హనుమాన్ జయంతి శోభాయాత్రను గత సంవత్సర క్రితం జరిగిన మాదిరిగానే అనుమతి గలదు అదే రూట్ లో నిర్వహించాలి కొత్త రూట్ లకు అనుమతి ఎలాంటిది లేదు పాత రూటు ప్రకారమే అనుమతి గలదు. నిర్వాహకులు తప్పనిసరి వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలి వారికి ముందుగానే ర్యాలీకి సంబంధించినటువంటి సూచనలు తెలియజేయాలి అన్నారు. డిజె సౌండ్ సిస్టం పూర్తిగా నిషేధమని తెలియజేశారు. డ్రోన్లు వాడకం నిషేధమని తెలిపారు. ఈ సమావేశంలో ర్యాలీ ఆర్గనైజర్లు వారి సందేహాలు సలహాలు  పోలీస్ కమిషనర్  స్వీకరించారు. ఈ సమావేశంలో బోధన్ ఏసిపి , పి. శ్రీనివాస్ , బోధన్ ఎస్. హెచ్. ఓ  వెంకట్ నారాయణ , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్  శ్రీశైలం , సిఐలు , ఎస్సైలు మరియు హిందూ ధర్మ ప్రచార మండలి ప్రవీణ్ గుప్తా , ఆర్గనైజషన్  గోపి , విశ్వ హిందూ పరిషత్ శ్రీ హరి కృష్ణ రెడ్డి , మారుతీ మందిరం పూజారి  ప్రవీణ్ మహారాజ్ , లయన్స్ క్లబ్ , బజరంగ్దళ్ , ఆర్య సమాజ్ , తదితరులు పాల్గొన్నారు.