JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 17 March 2026, 4:51 pm Posted by : JANA SANGARSHANA

బోధన్ పోలీస్ స్టేషన్లలో ‘ప్రజాపాలన’ శుభ్రత కార్యక్రమం నిర్వహించారు.

 

నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ పరిధిలోని రుద్రూర్, వర్ని, కోటగిరి సహా పలు పోలీస్ స్టేషన్లలో ‘ప్రజాపాలన’ శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై సాయన్న ఆధ్వర్యంలో సిబ్బంది శ్రమదానం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘ప్రజాపాలన’ కార్యక్రమంలో భాగంగా బోధన్ డివిజన్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో మంగళవారం పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. డిజిపి మరియు జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు రెంజల్, ఏడపల్లి, బోధన్ రూరల్, పట్టణ, రుద్రూర్, వర్ని, కోటగిరి పోలీస్ స్టేషన్లలో సిబ్బంది స్వచ్ఛందంగా శ్రమదానం చేశారు. రుద్రూర్ పోలీస్ స్టేషన్‌లో స్పెషల్ డ్రైవ్: రుద్రూర్ ఎస్సై సాయన్న ఆధ్వర్యంలో స్టేషన్ ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి, పరిసరాలను శుభ్రం చేశారు. కేవలం పరిసరాలే కాకుండా, స్టేషన్‌లోని ఫైళ్లను కూడా క్రమపద్ధతిలో సర్దుతూ శుచీశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. 90 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రతిరోజూ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటామని, దీనివల్ల ప్రజలకు మెరుగైన సేవలందించడానికి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ అంజాద్, కానిస్టేబుళ్లు గౌతమి, రాధిక, గజేందర్, లక్ష్మణ్ మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. డివిజన్ వ్యాప్తంగా పోలీసులు చేపట్టిన ఈ స్వచ్ఛంద కార్యక్రమంపై ప్రజల నుండి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.