బోధన్ మండలంలోని 108 అంబులెన్స్ను గురువారం నిజామాబాద్ జిల్లా సూపర్వైజర్ స్వరాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరు, మందుల నిల్వలు, వైద్య పరికరాలు, రికార్డులను పరిశీలించి ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని, కాలం చెల్లిన మందులను ఎప్పటికప్పుడు తొలగించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఎంటీ రజిత, పైలట్ వినోద్ పాల్గొన్నారు.