JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 3:50 pm Posted by : JANA SANGARSHANA

టిచర్ల్ ఫిట్మెంట్తో పిఆర్సి అమలు చేయాలి

టిచర్ల అపరిస్కృతంగా ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలి.

బోధన్ : ఏప్రిల్ 17

బోధన్ పట్టణంలోని టీజీ ఈ జేఏసీ ఆధ్వర్యంలో గత కొద్ది కాలంగా అపరిస్కృతంగా ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని నిరసన కార్యక్రమం చేపట్టి అనంతరం

బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో కి వినతి పత్రం అందజేశారు. ముఖ్యంగా 51 శాతం ఫిట్మెంట్తో పిఆర్సి అమలు చేయాలని గత కొద్ది కాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలని ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ హెల్త్ కార్డు వర్తింపచేయాలని సిపిఎస్ స్థానంలో ఓపిఎస్ వర్తింపజేయాలని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వమే మేము 57/457/5 ఆధారంగా 19 2004 ముందు నియమించబడిన ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్ వర్తింపజేయాలని కోరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో టీజీ ఈ జేఏసీ అధ్యక్షులు కార్తీక్ టిఆర్ఎస్ ఎ బాధ్యులు విట్టల్ పి.ఆర్. టి .యు నాయకులు శంకర్ ,థామస్, కైరాన్, ధన్రాజ్ ,గంగాధర్ బసవరాజ్ అభ్యెంధర్ సిటు నాయకులు నెమలి సంజీవ్, సలీం, వాహిద్ పెన్షనర్ల సంఘ అధ్యక్షులు రాజేశ్వరరావు, సత్యనారాయణ ,వెంకటేశం, టీ ఎన్ జి ఓ నాయకులు సాయిలు, శ్వేత, విమల ,స్రవంతి మరియు వివిధ సంఘ నాయకులు సుమారుగా 100 మంది పాల్గొని కార్యక్రమం నిరసన వ్యక్తంచేశారు.