JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 05 April 2026, 4:22 pm Posted by : JANA SANGARSHANA

పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే షకీల్

పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే షకీల్ సాలురా మండలంలో అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ధాన్యం కొనుగోలు కేంద్రాలను సకాలంలో ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. తక్షణమే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తగిన పరిహారం చెల్లించాలని కోరారు. మామిడి అరటి నష్టపోయిన రైతులకు తక్షణం ఆర్థిక సాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. మామిడి అరటి వరి నష్టపోయిన రైతులకు ఆదుకొని అండగా ఉండాలని అన్నారు తక్షణం పంట నష్టాన్ని అంచనా వేయాలని ఆయన డిమాండ్ చేశారు.