JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 9:06 pm Posted by : JANA SANGARSHANA

తెలంగాణలో బీజేపీ ఒంటరి పోరు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ్ చందర్ రావు

♦ జనసేనతో పొత్తు లేదు: స్పష్టం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు

♦ జిహెచ్‌ఎంసి, అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్‌గానే

♦ వచ్చే ఎన్నికల్లో బీజేపీదే అధికారం: రామచందర్ రావు ధీమా

♦ పార్టీలో అభిప్రాయ భేదాలే, విభేదాలు కావు

తెలంగాణ రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఏ ఇతర పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్. రామచందర్ రావు స్పష్టమైన ప్రకటన చేశారు.

ఇటీవల మీడియాతో మాట్లాడిన రామచందర్ రావు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనతో సహా రాష్ట్రంలో ఏ రాజకీయ పక్షంతోనూ తమకు పొత్తు ఉండదని కుండబద్దలు కొట్టారు.

రాబోయే జీహెచ్‌ఎంసీ (GHMC) ఎన్నికల్లో బీజేపీ సొంతంగానే, సింగిల్‌గా బరిలోకి దిగుతుందని రామచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో, ప్రజలు బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారని రామచందర్ రావు పేర్కొన్నారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసి విజయం సాధిస్తుందని, రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకుంటుందని రామచందర్ రావు గట్టి విశ్వాసం వ్యక్తం చేశారు.

పార్టీ అంతర్గత విషయాలపై స్పందిస్తూ, బీజేపీ నేతల మధ్య కేవలం అభిప్రాయ భేదాలు మాత్రమే ఉన్నాయని, ఎలాంటి అంతర్గత విభేదాలు లేదా కుమ్ములాటలు లేవని రామచందర్ రావు వివరణ ఇచ్చారు.

జనసేనతో రాష్ట్రంలో ఎలాంటి పొత్తు ఉండదని చెప్తూనే, జాతీయ స్థాయిలో జనసేన పార్టీ కేంద్ర ఎన్డీయే (NDA) కూటమిలో కీలక భాగస్వామిగా కొనసాగుతుందని రామచందర్ రావు వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో బీజేపీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసి, ఒంటరిగానే అధికారంలోకి తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని రామచందర్ రావు స్పష్టం చేశారు.