ఊట్పల్లి గ్రామ సర్పంచ్ ప్రశాంతి తిరుమలేష్ కు సన్మానం.
బోధన్ మార్చి:01 జన సంఘర్షణ
బోధన్ మండలంలోని ఊట్పల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ ప్రశాంతి తిరుమలేష్ కు ఊట్పల్లి ఆటో యూనియన్ నాయకులు ఆదివారం ఉదయం ఉట్పల్లి గ్రామపంచాయతీలో సన్మానం నిర్వహించారు. రైల్వే అండర్ బ్రిడ్జి పనులు కొనసాగుతున్న సందర్భంగా రాకాసిపేట్ నుండి బెల్లాల వరకు మూడు కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొలనందున ప్రశాంతి తిరుమలేష్ కు అడగక ఆయన సొంత డబ్బులతో హనుమాన్ టెక్డి అండర్ బ్రిడ్జి కింది నుండి పనులను పూర్తి చేసినందుకు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


