Homeతెలంగాణజిల్లా కేంద్రాలన్నింటి చుట్టూ రింగు రోడ్లు

జిల్లా కేంద్రాలన్నింటి చుట్టూ రింగు రోడ్లు

📰 Generate e-Paper Clip

తెలంగాణలోని ప్ర‌ధాన జిల్లా కేంద్రాలన్నింటి చుట్టూ రింగు రోడ్లు నిర్మించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాల‌ని ముఖ్య‌మంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు సూచించారు. జిల్లా కేంద్రాల్లోకి భారీ వాహ‌నాలు వెళ్ల‌కుండా నియంత్రించడంతో పాటు స‌ర‌కు ర‌వాణా వాహ‌నాలు వేగంగా వెళ్లేందుకు రింగు రోడ్లు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని చెప్పారు.  రోడ్లు – భవనాల శాఖ పురోగతిపై ముఖ్యమంత్రి గారు సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇప్ప‌టికే ఆయా జిల్లా కేంద్రాల‌కు స‌మీపంలో రోడ్లు ఉంటే వాటిని అనుసంధానించి రింగ్ రోడ్లు ఏర్పాటు చేయాల‌న్నారు. జాతీయ ర‌హ‌దారుల‌కు రింగు రోడ్ల‌ను అనుసంధానించే అంశంపై అధ్య‌య‌నం చేయాల‌ని అధికారులను ఆదేశించారు. హైద‌రాబాద్‌ – విజ‌య‌వాడ ఎక్స్‌ప్రెస్ వే నుంచి నాగార్జునసాగ‌ర్ చేరేందుకు గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణంపై అధ్య‌య‌నం చేయాల‌ని చెప్పారు.  ఇప్ప‌టికే నిర్మాణంలో ఉన్న ఆర్వోబీలు, ఆర్‌యూబీల నిర్మాణాలు త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని, అవ‌స‌ర‌మైన నూత‌న ఆర్వోబీలు, ఆర్‌యూబీల నిర్మాణాలకు ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేయాల‌న్నారు. బోధ‌నాసుప‌త్రులు, ఇత‌ర పెద్దాసుప‌త్రుల నిర్మాణ‌ల‌ను త్వ‌రగా పూర్తి చేయాల‌ని ఆదేశించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular