సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
బోధన్: ఏప్రిల్ 24జన సంఘర్షణ
తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు శాసనసభ్యులు పొద్దుటూరి. సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ లబ్ధిదారులకు చెక్కులను
బోధన్ మండలంలోని ఊట్ పల్లి గ్రామంలో గ్రామ ఉప సర్పంచ్ నరేందర్ గౌడ్ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… అనారోగ్యంతో బాధపడుతున్న వారికి చాలా మేలైన పథకం అని అన్నారు. లబ్ధిదారులకు చేరేలా కృషి చేస్తానని ఆయన తెలిపారు. లబ్ధిదారులు హర్షం వ్యక్తంచేశారు. కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ డివి. ప్రభాకర్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.


