బోధన్ ఆర్డిఓ బాధ్యతలు చేపట్టిన ఎం.విజయ కుమారి.
బోధన్ మే 11: జన సంఘర్షణ
హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్స్లో పనిచేస్తున్న ఎం.విజయ కుమారి బోధన్ ఆర్డీవోగా నియమితులయ్యారు.
బోధన్ ఆర్డీవో గా సోమవారం ఉదయం 10 గంటలకు ఎం.విజయ కుమారి బోధన్ ఆర్డీవో కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… బోధన్ నీటి సమస్య తీవ్ర సమస్యలు ఉన్నాయని తెలుసుకున్న శాశ్వత పరిష్కారం చేపడతానన్నారు. బోధన్ పట్టణ వాసులకు నీటి కొరత లేకుండా చేపడతానని ఆమె తెలిపారు. ఏవైనా సమస్యలు ఉంటే దృష్టికి తీసుకురావాలని ఆమె పేర్కొన్నారు. బోధన్ పట్టణవాసులు సోమవారం సాయంత్రం ఎవరైనా బోధన్ ఆర్డీవో ని కలవాలనుకుంటే 3 గం.లకు నుంచి సమయం కేటాయించారని ఆర్డిఓ ఆఫీస్ వర్గాలు పేర్కొన్నారు.


