21న కలెక్టరేట్ ముట్టడి- బిజేపీ
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 21న కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బిజేపీ నిజామాబాద్ జీల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి తెలిపారు. మంగళవారం బిజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హామీలు ఇచ్చి మోసం చేసిన ప్రభుత్వానికి కలెక్టరేట్ ముట్టడి తమ సమాధానమన్నారు. కాగా రేపు మండల స్థాయిలో ఎమ్మార్వో కార్యాలయాలకు వినతిపత్రాలు అందజేస్తామన్నారు.


